దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) 2022 నోటిఫికేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం విడుదల చేసింది. దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 ,2022 నుంచి మే 6,2022 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.
జనరల్/ అన్ రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు రూ.650, జనరల్ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ -నాన్ క్రిమిలేయర్కు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జెండర్కు రూ. 550 ఫీజుగా నిర్ణయించారు. జూలై 2022 మొదటి లేదా రెండో వారంలో సీయూఈటీ 2022 ప్రవేశ పరీక్ష ఉంటుందని ఎన్టీఏ నోటిఫికేషన్లో తెలిపింది. మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు https://cuet.samarth.ac.in. వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది.