CTET | న్యూఢిల్లీ, మార్చి 7: దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ‘సీటెట్’ జూలై 2024 నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. 19వ ఎడిషన్ సీటెట్ పరీక్షను 2024 జూలై 7న (ఆదివారం) నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 136 నగరాల్లో 20 భాషల్లో నిర్వహించే ఈ పరీక్షకు మార్చి 7 నుంచి ఏప్రిల్ 2 రాత్రి 11.59 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. సీటెట్ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు.