న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ(Finance Ministry) ఇవాళ కీలక ప్రకటన చేసింది. క్రిప్టో లావాదేవీలు(Crypto Transactions).. మనీ ల్యాండరింగ్ చట్టం(Money Laundering Act) కిందకు రానున్నట్లు పేర్కొన్నది. దీనిపై ఆ శాఖ ఇవాళ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ పేరుతో సాగే లావాదేవీలు అన్నీ పీఎంఎల్ఏ చట్టం కింద రానున్నట్లు ప్రభుత్వం తన నోటిఫికేషన్లో చెప్పింది. డిజిటల్ ఆస్తుల కదలికలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్ర సర్కార్ ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకున్నది.
క్రిప్టో లావాదేవీలకు సహకరించే ఇన్వెస్టర్ల(Investors)కు కూడా కేంద్ర ఆర్థిక శాఖ తన గెజిట్లో వార్నింగ్ ఇచ్చింది. వర్చువల్ డిజిటల్ అసెట్ల(Digital Assets)ను సేల్ చేయరాదు అని ఆర్థిక శాఖ తన వార్నింగ్లో తెలిపింది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ మార్పిడి కానీ, ట్రాన్స్ఫర్ కానీ పీఎంఎల్ఏ చట్టం కిందకు రానున్నట్లు ఆ నోటిఫికేషన్లో తెలిపారు.
క్రిప్టో పద్ధితిలో ఏదైన సమాచారాన్ని కానీ, కోడ్ను కానీ, నెంబర్ను కానీ, టోకెన్ను కానీ జారీ చేస్తే.. ఆదాయపన్నుశాఖ(Income Tax) చట్టం ప్రకారం అది నేరం అవుతుందని నోటిఫకేషన్లో తెలిపారు. మనీల్యాండరింగ్, ఫోరెక్స్ ఉల్లంఘన కేసులను ఇప్పటికే ఈడీ(Enforcement Directorate) విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే క్రిప్టో కంపెనీల ఎక్స్చేంజ్ కేసుల్ని కూడా ఈడీ విచారిస్తున్నది.