Annamalai | చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వివాదంలో చిక్కుకున్నారు. మహిళా జర్నలిస్టుతో ఆయన అనుచితంగా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి. కోయంబత్తూరులో సోమవారం అన్నామలై విలేకరులతో మాట్లాడారు. మీరు బీజేపీ చీఫ్ కాకపోయి ఉంటే పార్టీలో ఉండేవారా అని ఈ సందర్భంగా ఓ మహిళా జర్నలిస్టు ఆయన్ను ప్రశ్నించారు. అన్నామలై ఆమెను వేదికపైకి రావాలని, తన పక్కన నిల్చోవాలని పట్టుబట్టారు. తనను ప్రశ్నించిన వారిని ప్రజలు చూడాలని, తన పక్కన నిల్చోవాలని పదేపదే ఆయన వేదికపైకి పిలిచారు. దీంతో జర్నలిస్టులు ఆయన తీరును తప్పుబట్టారు. దీంతో వెనక్కి తగ్గిన అన్నామలై ఏ విధమైన ప్రశ్నలు వేయాలో జర్నలిస్టులకు సలహా ఇచ్చానని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.