Crime news: రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జితేంద్ర ఓఝా అనే 48 ఏళ్ల వ్యక్తి తన పదేళ్ల కొడుకును నీటి కుంటలో తోసి చంపేశాడు. అనంతరం తాను కూడా అదే కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జితేంద్ర ఓఝా ఎందుకు అంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడో తెలియాల్సి ఉందని చెప్పారు. అయితే, జితేంద్ర ఓఝా తన కొడుకును నీటి కుంటలోకి తోయగానే ఆ బాలుడు పలుమార్లు బయటికి వచ్చే ప్రయత్నం చేశాడని, కానీ ఓఝా మళ్లీమళ్లీ నీళ్లలోకి తోసేశాడని స్థానికులు చెప్పుకుంటున్నట్లు వెల్లడించారు.