న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ కోర్టులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యాయవాది వేషధారణలో వచ్చిన దుండగుడు కోర్టుకు వచ్చిన ఓ మహిళే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాడు. మహిళపై ఏకంగా నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయాడు. బుల్లెట్లన్నీ ఆమె పొట్టలోకి దూసుకెళ్లాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ మహిళను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, ఘటనపై సమాచారం అందుకున్న అక్కడికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి క్లూస్ టీమ్ పలు ఆధారాలను సేకరించింది. కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తిపై హిస్టరీ షీట్ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.
Delhi: A woman has been injured in an incident of firing at Saket court. Four rounds were fired. Police on the spot.
(Warning: Disturbing visuals)
Visuals confirmed by police. pic.twitter.com/vdaUBqZxmp— ANI (@ANI) April 21, 2023
#WATCH | Delhi: Firing incident reported in Saket court. Crime team & Forensic Science Laboratory (FSL) inspecting the spot. pic.twitter.com/gYR2g7Ufc5
— ANI (@ANI) April 21, 2023