గుజరాత్లో వేల ఆవులు రోడ్లపైకి వచ్చాయి. షెల్టర్ హోమ్స్ నిర్వహణకు రూ.500 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీంతో నిరసన చేపట్టిన 200 మంది షెల్టర్ హోమ్స్ నిర్వాహకులు గురువారం ఆవులను బయటికి వదిలిపెట్టారు.
దీంతో ఆ ఆవులన్నీ రోడ్లపైకి చేరి, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం ఇలాగే అలసత్వం వహిస్తే తమ ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.