భోపాల్: ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులోకి ఒక ఆవు ప్రవేశించింది. అక్కడంతా స్వేచ్ఛగా తిరిగింది. దీంతో ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బందిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. దీంతో ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిపై విమర్శలు వెల్లువెత్తాయి. శుక్రవారం రాజ్గఢ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులోకి ఒక ఆవు వచ్చింది. అక్కడంతా స్వేచ్ఛగా తిరిగింది. దీంతో ఆ వార్డులో చికిత్స పొందుతున్న రోగులు కొంత భయాందోళన చెందారు. చివరకు రోగి బంధువులు ఆ ఆవును ఐసీయూ వార్డు నుంచి బయటకు తరిమారు. ఆ సమయంలో ఐసీయూ వార్డులో వైద్య సిబ్బంది ఎవరూ లేరు.
కాగా, ఆ ఆసుపత్రిలో ఉన్న వ్యక్తి మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జిల్లా వైద్య అధికారుల దృష్టికి ఇది వెళ్లింది. స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు సిబ్బంది, సెక్యూరిటీ గార్డును ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఆసుపత్రిలోకి పశువులు చొరబడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా రెండు గేట్ల వద్ద ఇద్దరు వ్యక్తులను నియమించినప్పటికీ ఈ సంఘటన జరుగడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
मध्य प्रदेश के राजगढ़ में अस्पताल के ICU वार्ड में गाय घुस गई। pic.twitter.com/ffHMkbwoYS
— Priya singh (@priyarajputlive) November 19, 2022