Covid-19 | న్యూఢిల్లీ, మార్చి 8: కొవిడ్ తగ్గినప్పటికీ బాధితుల రక్తంలో వైరస్ శకలాలు(యాంటిజెన్లు) 14 నెలల పాటు ఉంటున్నాయని, కణజాలంలో దాదాపుగా రెండేండ్ల వరకు ఉంటున్నట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు. చాలామందిలో లాంగ్ కొవిడ్కు ఇదే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వారి కంటే ఎక్కువున్న వారిలో, దవాఖానలో చికిత్స తీసుకున్న వారిలో వైరస్ యాంటిజెన్లు రెట్టింపు స్థాయిలో ఉంటున్నట్టు గుర్తించారు. లాంగ్ కొవిడ్కు, గుండెపోట్లకు ఈ వైరస్ శకలాలే కారణమా అనేది కచ్చితంగా నిర్ధారించేందుకు మరింత లోతుగా పరిశోధన చేయాల్సి ఉందని పరిశోధకుడు మైఖేల్ పెలుసో పేర్కొన్నారు.