హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ కొత్త మైలురాయిని అందుకున్నది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య 4.2 కోట్లు దాటింది. ఇవాళ ఉదయం 7 గంటల వరకు 4 కోట్ల 20 లక్షల 392 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత 24 గంటల్లో 27 లక్షల మందికి కోవిడ్ టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. అయితే మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో కోవిడ్ టీకాలు ఇచ్చిన జాబితాలో భారత్ రెండవ స్థానంలో నిలిచింది. అత్యధిక సంఖ్యలో టీకాలు ఇచ్చిన దేశాల్లో అమెరికా టాప్లో ఉంది.