Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కొత్త కేసుల సంఖ్య వెయ్యి దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,016 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,63,968కి చేరింది. ప్రస్తుతం దేశంలో 13,187 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,20,267 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,514కి చేరింది.
ఇక మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.78 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 219.76 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.