JN.1 | భారత్లో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 (JN.1) చాపకిందనీరులా విస్తరిస్తోంది. దేశంలో ఈ తరహా కేసులు తాజాగా 200 దాటాయి. ఇప్పటి వరకూ జేఎన్.1 కేసులు 263కు చేరినట్లు ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) మంగళవారం వెల్లడించింది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించిందని పేర్కొంది.
ఇక ఈ తరహా కేసులు కేరళలోనే అత్యధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేరళలో ఏకంగా 133 జేఎన్.1 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత గోవాలో 51, గుజరాత్లో 34, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 9, రాజస్థాన్లో 5, తమిళనాడులో 4, తెలంగాణలో 2, ఒడిశాలో 1 కేసు నమోదైనట్లు వెల్లడించింది. మొత్తం కేసుల్లో 239 కేసులు డిసెంబర్లో వెలుగు చూడగా.. 24 కేసులు నవంబర్ నెలలో బయటపడినట్లు ఇన్సాకాగ్ వివరించింది.
మరోవైపు BA 2.86 రకానికి చెందిన ఈ జేఎన్.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించిన విషయం తెలిసిందే. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. ముప్పు తక్కువేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఈ రకం కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అసవరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
దేశంలో 4,565కి పెరిగిన క్రియాశీల కేసులు..
ఇదిలా ఉండగా.. భారత్లో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 573 కరోనా కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 4,565కి పెరిగింది. ఇక నిన్న ఒక్కరోజే రెండు మరణాలు నమోదయ్యాయి. హర్యాణాలో ఒకరు, కర్ణాటకలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,366కి పెరిగింది. కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,76,550గా ఉంది.
Also Read..
Dawood Ibrahim | వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు..!
Lottery | లాటరీలో మిలియన్ డాలర్లు గెలుచుకున్న మహిళ.. పట్టరాని సంతోషంతో స్టేజ్పైనే పడిపోయి
Truck Drivers | ట్రక్కు డ్రైవర్ల రాస్తారోకో.. పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన జనం