ముంబై : ఫేక్ కొవిడ్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠా గుట్టును ముంబై పోలీసులు రట్టు చేశారు. నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి డబ్బులు దండుకుంటున్న ముఠాలోని ఇద్దరు సభ్యులను క్రైమ్బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ చేసిన ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు ముఠాను పట్టుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తులకు నకిలీ సర్టిఫికెట్ల ఇస్తూ.. వారి నుంచి భారీ మొత్తాన్ని దండుకుంటున్నారని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అరెస్టయిన ఇద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే ఈ ముఠాలోని మిగతా గ్యాంగ్ను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.