న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ నిబంధనలను ఎత్తివేస్తున్నాయి. అయితే, ఉత్తరాఖండ్లో మాత్రం కరోనా వైరస్ ప్రభావం కొంత ఎక్కువగానే ఉన్నది. దాంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కర్ఫ్యూ నింబంధనలను మరింత పొడిగించింది. 2021, జూలై 13న ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి సుబోధ్ ఉనియాల్ ప్రకటించారు. అయితే, 50 శాతం కెపాసిటీతో షాపింగ్ మాల్స్ను తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అంతేగాక వారాంతాల్లో మార్కెట్లు అన్నింటిని మూసివేయాలని ఆదేశించారు.