న్యూఢిల్లీ, జనవరి 14: దేశవ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,64,202 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,65,82,129కు చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12,72,073కు ఎగబాకింది. తాజాగా కరోనాతో 315 మంది మరణించగా, కరోనా మరణాల సంఖ్య 4,85,350కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతంగా నమోదైంది.
తొలి 5 నిమిషాలు ప్రమాదకరం..
కరోనా వైరస్ గాల్లోకి చేరిన 5 నిమిషాల దాకా చాలా ప్రమాదకారి అని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఆ తర్వాతి నుంచి 20 నిమిషాల్లో వేరే వ్యక్తులకు సోకే ప్రభావాన్ని కోల్పోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
మార్చిలో తగ్గుముఖం..
థర్డ్వేవ్ మార్చి నెల మధ్య కాలానికి పూర్తిగా తగ్గుముఖం పడుతాయని ఐఐటీ కాన్పూర్కు చెందని ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలో సంభవించిన మరణాల్లో 75 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోని వారివేనని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు.