పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రభుత్వం కొవిడ్ టీకా తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. ఒమిక్రాన్ భయాందోళనల మధ్య వందశాతం టీకా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. టీకా తీసుకోకుంటే చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కొంటారని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సేవల డైరెక్టర్ బీ శ్రీరాములు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
తప్పనిసరిగా టీకాలను వేసే లక్ష్యంతో పుదుచ్చేరి ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ యాక్ట్ 1973లోని నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. వ్యాక్సిన్ వేసుకోకుంటు తప్పనిసరిగా చట్టంలోని నిబంధనల ప్రకారం శిక్షార్హన చర్యలను ఎదుర్కొంటారని డైరెక్టర్ హెచ్చరించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడి ఓ ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మహమ్మారి పరిస్థితుల్లో కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజారోగ్య చట్టంలో ఓ నిబంధన ఉందని అధికారి పేర్కొన్నారు.