తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ( COVID-19 ) విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ పోతున్నా కేరళలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నది. అక్కడ రోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం పాజిటివ్ కేసులలో కేవలం కేరళ రాష్ట్రం నుంచే 40 శాతానికి పైగా కొత్త కేసులు ఉంటున్నాయి.
ఇవాళ కూడా కేరళలో 18,607 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివిటీ రేటు కూడా అంతకంతకే పెరిగిపోతున్నది. ఇవాళ పాజిటివిటీ రేటు 13.87 శాతానికి చేరింది. అయితే, ఇవాళ 20,108 మంది బాధితులు వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారు. కానీ 93 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.