న్యూఢిల్లీ, జూలై 18: కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 2-6 ఏండ్లలోపు పిల్లలకు రెండో డోస్ను వచ్చే వారం ఇవ్వనున్నట్టు సమాచారం. ఢిల్లీలోని ఎయిమ్స్లో పిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే 6-12 ఏండ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ రెండో డోస్ వేశారు. కొవాగ్జిన్ను హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేస్తున్న సంగతి తెలిసిందే. జైడస్ క్యాడిలాకు చెందిన కరోనా వ్యాక్సిన్ను కూడా పిల్లలపై పరీక్షిస్తున్నారు. రెండో డోస్ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఆగస్టు చివరి నాటికి మధ్యంతర నివేదికను ఆ సంస్థ అందజేసే అవకాశం ఉన్నది.