Bharat Biotech | కరోనా మహమ్మారిని నిరోధించడానికి రెండేండ్ల నుంచి 18 ఏండ్ల లోపు పిల్లల కోసం తయారు చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ సురక్షితమేనని పరిశోధనల్లో తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది. వైరస్ ప్రభావాన్ని తట్టుకోవడంతోపాటు మెరుగైన రోగ నిరోధక శక్తిని కలిగి ఉందని చివరిదశ టెస్ట్ల్లో తేలిందని వెల్లడించింది. కొవాగ్జిన్ సురక్షిత, ప్రతిస్పందన, రోగ నిరోధక శక్తి సామర్థ్యంపై గతేడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య రెండో, మూడో దశ ట్రయల్స్లో సమర్థవంత ఫలితాలు వచ్చాయని భారత్ బయోటెక్ వివరించిందని ది లాన్సెట్ జర్నల్ ప్రచురితమైంది.
పిల్లలపై కొవాగ్జిన్ ప్రభావానికి సంబంధించి జరిపిన పరిశోధనల సమాచారాన్ని గతేడాది అక్టోబర్లోనే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) భారత్ బయోటెక్ వివరించింది. తమ పరిశోధనల్లో ఎటువంటి తీవ్ర దుష్ప్రభావాలు జరుగలేదని వెల్లడించింది. 374 మందిలోనే స్వల్ప దుష్ప్రభావం కనిపించిందని పేర్కొంది. ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి రావడం వంటి సాధారణ దుష్ప్రభావం చాలా మందిలో కలిగిందన్నది. అందువల్లే 6-18 మధ్య పిల్లలకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసేందుకు అత్యవసర అనుమతి లభించిందని తెలిపింది.