న్యూఢిల్లీ : అల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు మహ్మద్ జుబేర్ బెయిల్ దరఖాస్తును ఢిల్లీ కోర్టు శనివారం తోసిపుచ్చింది. 2018లో అభ్యంతరకర ట్వీట్ కేసుకు సంబంధించి జుబేర్ను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. అంతకుముందు జుబేర్ అయిదు రోజుల కస్టడీ విచారణ ముగియడంతో పోలీసులు ఆయనను కోర్టు ఎదుట హాజరు పరిచారు.
మరికొన్ని రోజుల పాటు కస్టడీ విచారణ అవసరమని, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు తరలించాలని పోలీసులు కోర్టును కోరారు. కేసు తీవ్రత దృష్ట్యా ఆరోపణల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం లేదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు దర్యాప్తులో భాగంగా జుబేర్ మొబైల్ ఫోన్, హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్న అనంతరం మహ్మద్ జుబేర్ జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోరారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టాడనే ఆరోపణలపై జుబేర్ను ఢిల్లీ పోలీస్ సైబర్ విభాగం అరెస్ట్ చేసింది.