న్యూఢిల్లీ : లైంగిక దాడి కేసులో లోక్ జనశక్తి (ఎల్జేపీ) పార్టీ ఎంపీ ప్రిన్స్ రాజ్కు ఢిల్లీ కోర్టు శనివారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎంపీ బెయిల్ పిటిషన్ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధల్ రూ లక్ష బాండ్, అంతే మొత్తానికి పూచీకత్తుపై ప్రిన్స్ రాజ్కు బెయిల్ మంజూరు చేశారు. దివంగత కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ మేనల్లుడు, చిరాగ్ పాశ్వాన్కు కజిన్ అయిన రాజ్ బిహార్లోని సమస్ధిపూర్ నుంచి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ కేసులో బాధితురాలు, ఆమె బాయ్ఫ్రెండ్ 2020 నుంచి తమ క్లెయింట్ను డబ్బుల కోసం బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని బెయిల్ అప్లికేషన్లో ఎంపీ తరపు న్యాయవాది నితేష్ రాణా పేర్కొన్నారు. కాగా తాను స్పృహలో లేని సమయంలో ఎల్జేపీ ఎంపీ రాజ్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ పార్టీ మహిళా కార్యకర్త ఫిర్యాదు ఆధారంగా కోర్టు ఆదేశాలతో ఎంపీపై కేసు నమోదైంది.