iphone| కోల్కతా: సామాజిక మాధ్యమాలు, ఆధునిక పోకడలు కుటుంబ బంధాలను తెంచేస్తున్నాయి. పశ్చిమబెంగాల్కు చెందిన దంపతులు ఐఫోన్ కొనేందుకు కన్నకొడుకునే అమ్మేశారు. రీల్స్ చేసేందుకు అభుశుభం తెలియని ఎనిమిది నెలల పసికందును విక్రయించారు. నిందితులను కోల్కతాకు చెందిన జయదేవ్, సతిగా గుర్తించారు. వారికి ఏడేండ్ల కూతురు, 8 నెలల కుమారుడు ఉన్నారు. గత శనివారం కుమారుడిని విక్రయించిన ఆ దంపతులు.. అనంతరం ఖరీదైన ఐఫోన్ను కొనుగోలు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి రీల్స్ చేశారు.
ఇలా దొరికేశారు..
రోజు గడవడమే కష్టంగా ఉండే ఆ దంపతుల చేతుల్లో ఖరీదైన ఐఫోన్ ఉండటం, కుమారుడు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానమొచ్చింది. దీంతో వారు భార్యాభర్తలను నిలదీయగా, డబ్బు కోసం కుమారుడిని విక్రయించినట్టు అంగీకరించారు. జయదేవ్తోపాటు బిడ్డను కొనుగోలు చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కుమార్తెను విక్రయించేందుకు కూడా జయదేవ్ ప్రయత్నించాడని, తాము అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చినట్టు స్థానిక కౌన్సిలర్ తారక్ గుహ తెలిపారు.