(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : గ్యాస్ గీజర్ వాడటంతో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఊపిరాడక యూపీలో దంపతులు మృతి. గ్యాస్ గీజర్ నుంచి గ్యాస్ లీకై ఊపిరి అందక కర్ణాటకలో అక్కాచెల్లెళ్ల దుర్మరణం. గ్యాస్ గీజర్ కారణంగా ముంబైలో వృద్ధ దంపతులు మృతి.. గ్యాస్ గీజర్ ప్రమాదాలకు సంబంధించి రోజూ ఇలాంటి వార్తలు నిత్యకృత్యంగా మారాయి. దీంతో గ్యాస్ గీజర్లు ఎంత భద్రం అనే ప్రశ్న వస్తున్నది. ఈ నేపథ్యంలో గ్యాస్ గీజర్ వాడకంపై నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు.
నీటిని వేడి చేయడానికి సాధారణంగా ఎలక్ట్రిక్ గీజర్లు, వాటర్ హీటర్లను వాడుతారు. అయితే, కరెంటు బిల్లుతో పోల్చి చూస్తే.. గ్యాస్ వాడకం కాస్త చవక అనే ఉద్దేశంతో బడ్జెట్ దృష్ట్యా గ్యాస్ గీజర్లను వాడటం పెరిగింది. అయితే ఎలక్ట్రిక్ గీజర్లతో పోల్చితే గ్యాస్ గీజర్లతో ప్రమాదాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.