బాబా రాందేవ్కు షాక్ : పతంజలి కరోనిల్ విక్రయాలపై నిషేధం

ముంబై : కరోనా వైరస్ నియంత్రణ కోసం బాబా రాందేవ్కు చెందిన పతంజలి అభివృద్ధి చేసిన కరోనిల్ ఔషధ విక్రయాలపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. డబ్ల్యూహెచ్ఓ, ఐఎంఏ వంటి ప్రతిష్టాత్మక ఆరోగ్య సంస్ధల అనుమతి లేకుండా కరోనిల్ విక్రయాలను మహారాష్ట్రలో అనుమతించమని హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ స్పష్టం చేశారు. కరోనిల్ క్లినికల్ ట్రయల్స్పై ఐఎంఏ సందేహాలు లేవనెత్తడంతో పాటు కరోనా కట్టడి ఔషధం కోసం పతంజలి ఆయుర్వేదకు తాము ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసిందని అనిల్ దేశ్ముఖ్ ట్వీట్ చేశారు.
హడావిడిగా ఇద్దరు సీనియర్ కేంద్ర మంత్రుల సమక్షంలో డ్రగ్ను లాంఛ్ చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. కాగా డబ్ల్యూహెచ్ఓ సర్టిఫికేషన్పై పతంజలి ఆయుర్వేద అసత్యాలు ప్రచారం చేయడం పట్ల ఐఎంఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఔషధాన్ని స్వయంగా డాక్టర్ అయిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రమోట్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
- గోమాతలకు సీమంతం.. ప్రత్యేక పూజలు
- కూతురి కళ్లెదుటే.. తండ్రిని కత్తులతో పొడిచి చంపారు
- ‘పెట్రో’ ఎఫెక్ట్.. రూ.12 పెరగనున్న పాల ధర!