సిటీబ్యూరో, జులై 6(నమస్తే తెలంగాణ): అమెరికాలో ఉండే స్నేహితుడి ఫొటోను డీపీగా పెట్టిన సైబర్ నేరగాళ్లు.. ఓ వ్యక్తికి రూ.5లక్షలు టోకరా వేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్లో ఉండే ప్రైవేటు ఉద్యోగి సురేశ్బాబుకు.. అమెరికాలో ఉండే స్నేహితుడు రమేశ్ ఫొటోను డీపీగా పెట్టిన సైబర్నేరగాళ్లు.. వాట్సాప్ కాల్ చేసి.. అర్జెంట్గా రూ. 3 లక్షలు కావాలని ఖాతా నంబర్ పంపించారు. మొదటి రూ.3లక్షలు, తరువాత మరో రూ. 2 లక్షలు పంపించాడు. మళ్లీ 2 లక్షలు అడుగడంతో అనుమానం వచ్చిన సురేశ్బాబు… నంబర్ చెక్ చేయగా.. మోసపోయానని గుర్తించి మంగళవారం సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో ఘటనలో చార్మినార్కు చెందిన మహ్మద్ అజారుద్దీన్కు సైబర్నేరగాళ్లు ఫోన్ చేసి, మీ పేరుపై మహేంద్ర ఎస్యూవీ కారు బహుమతిగా వచ్చిందని, ఇందుకు కొన్ని ఫీజులు చెల్లించాలంటూ రూ. 2.13 లక్షలు వసూలు చేశారు. ఆయా ఫిర్యాదులపై పోలీసులు కేసులు దర్యాప్తు చేపట్టారు.