తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ( Covid ) ప్రభావం ఇంకా తగ్గడంలేదు. అక్కడ ఇప్పటికీ 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా కొత్తగా 20,487 మందికి పాజిటివ్ వచ్చింది. ఇవాళ మొత్తం 1,34,861 మందికి పరీక్షలు నిర్వహించగా 20,487 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే పాజిటివిటీ రేటు 15.19 శాతంగా ఉన్నది. ఇక కొత్తగా 22,155 మంది కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు.
ఇదిలావుంటే కరోనా మరణాలు కూడా కేరళలో భారీగానే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 181 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 22,484కు పెరిగింది. కేరళ ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.