న్యూఢిల్లీ: కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. దేశంలో 113 రోజుల తర్వాత ఒక్కరోజే ఆదివారం 524 కొవిడ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతున్నది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 3,809కు చేరుకొన్నది. తాజాగా, కొవిడ్-19తో కేరళ, తమిళనాడు రాష్ర్టాల్లో ఒక్కొక్కరు మృతిచెందగా, కరోనా మృతుల సంఖ్య 5,30,782కు చేరుకొన్నట్టు అధికారులు వెల్లడించారు.
మొత్తం ఇన్ఫెక్షన్లలో క్రియాశీల కేసుల సంఖ్య 0.01 శాతం, రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. దేశంలో ఫ్లూ కేసులతోపాటు కొవిడ్-19 కేసులు కూడా పెరుగుతున్నందున కొత్త ఒమిక్రాన్ వేరియంట్ ప్రబలే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.