న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,041 కొత్త కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం పేర్కొన్నది. గురువారం కూడా ఒక్కసారిగా వెయ్యి కేసుల పెరుగుదలతో 3,712 కేసులు నమోదయ్యాయి. దాదాపు మూడు నెలల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 4 వేల మార్క్ను దాటడం ఇదే తొలిసారి. చివరిగా మార్చి 11న 4,194 కొత్త కేసులు నమోదయ్యాయ. తాజా కొత్త కేసుల నేపథ్యంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.95కి చేరింది. యాక్టివ్ కేసులు 21,177కి పెరిగాయి. కొత్త కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. పరీక్షలు కొనసాగించాలని కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ కు ఆరోగ్యశాఖ లేఖ రాసింది.
కరోనా హాట్స్పాట్గా ఐఐటీ-బాంబే
ఐఐటీ-బాంబే క్యాంపస్ కొవిడ్ హాట్స్పాట్గా మారింది. గడిచిన కొన్ని రోజుల వ్యవధిలోనే క్యాంపస్లో 30 కేసులు వెలుగుచూసినట్టు అధికారులు తెలిపారు. బాధితులకు స్వల్ప లక్షణాలు ఉండటంతో వెంటనే ఐసోలేషన్కు పంపించినట్టు వెల్లడించారు. సంస్థను మూసేయలేదని, తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు వివరించారు.