కోవిడ్ రోగులకు అవసరమైన మందులు దొరకడం లేదని ఇప్పటికే పలురాష్ట్రాల్లో రోగి బంధువులు, కుటుంసభ్యులు ఆందోళనల బాటపట్టారు. ఇప్పుడు వారికి తోడుగా నాగ్పూర్ ప్రభుత్వ వైద్యులు, మెడికల్ స్టూడెంట్స్ నిలిచారు. ఆక్సిజన్ బెడ్స్ , రెమ్ డెసివర్ ఇంజక్షన్లు కొరతను నిరసనగా ఈనెల 11న ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వైద్యాధికారులతో ఈ విషయమై చర్చలు జరిపినా సరైన సమాధానం రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రెసిడెంట్ డాక్టర్స్ అన్నారు.