న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్కు పెద్ద ఎత్తున వంటనూనెలు దిగుమతి అవుతున్నాయి. గత నెల అక్టోబర్తో ముగిసిన ఏడాది కాలంలో ఏకంగా 140.3 లక్షల టన్నులకు చేరాయి. వీటి విలువ రూ.1.57 లక్షల కోట్లను తాకింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే 34.18 శాతం ఎక్కువ. 2020-21 నవంబర్-అక్టోబర్లో దేశంలోకి 131.3 లక్షల టన్నుల వంటనూనెలు దిగుమతి అయ్యాయి. వీటి విలువ రూ.1.17 లక్షల కోట్లని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సోమవారం తెలిపింది.
9 నెలలూ పెరుగుదలే
2021-22 నవంబర్-అక్టోబర్లో తొలి రెండు త్రైమాసికాలు వంటనూనెల దిగుమతి క్రమేణా పెరుగుతూపోయిందని, మూడో త్రైమాసికంలో మాత్రం తగ్గాయని ఎస్ఈఏ వెల్లడించింది. మళ్లీ నాలుగో త్రైమాసికంలో ఎగిశాయని, ఇందుకు ఇండోనేషియా పామాయిల్ దిగుమతులపై తొలగిన నిషేధమే కారణమని చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు బాగా పడిపోవడం కూడా దిగుమతుల్ని పెంచిందన్నది.
పెరిగిన సోయాబీన్ ఆయిల్ దిగుమతులు
2021-22లో సోయాబీన్ ఆయిల్ దిగుమతులు 41.71 లక్షల టన్నులకు పెరిగాయి. సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులూ 19.44 లక్షల టన్నులుగా నమోదయ్యాయి.