చెన్నై: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్పై వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తమిళనాడుకు చెందిన ప్రముఖ పబ్లిషర్, రాజకీయ విశ్లేషకుడు బద్రి శేషాద్రిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బీజేపీకి గట్టి మద్దతుదారు అయిన శేషాద్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం తక్షణం స్పందించకుంటే, తాము జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేశారు.
‘చంద్రచూడ్కు తుపాకీ ఇచ్చి మణిపూర్కు పంపిద్దాం.. అక్కడ శాంతిని పునరుద్ధరించగలడో లేదో చూద్దాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బద్రి శేషాద్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శేషాద్రికి ఆరెస్టును తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఖండిస్తూ ట్వీట్ చేశారు.