Kangana Ranaut | న్యూఢిల్లీ: ‘రాజకీయ నేతగా మారిన నటి కంగనా రనౌత్ గొడ్డు మాంసం తిన్నారు.. ఇష్టపడ్డారు. బీజేపీ ఆమెకు మండీ టికెట్ ఇచ్చిందంటూ’ మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత షైనా ఎన్సీ తీవ్రంగా మండిపడ్డారు.
ఈ మేరకు ఆమె తాను మాట్లాడిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. పాతకాలం నాటి ఆలోచనలతో కాంగ్రెస్ నేతలు ఇలాంటి హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదన్నారు.