న్యూఢిల్లీ: ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు కొత్తగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది.
ఈ అంశంపై న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలుచేసిన పిల్ను చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జిస్టస్ జేబీ పార్థివాలాతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ వాదనలు వినిపిస్తూ.. బహుభార్యత్వం, నిఖా హలాలా రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధమని ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.