కొలొంబో: దేశంలో పార్లమెంట్ సర్వోన్నతమైనది కాదని, రాజ్యాంగమే సర్వోన్నతమైనదని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. రాజ్యాంగపరమైన ప్రజాస్వామ్యం ఒకే అధికార కేంద్రం చుట్టూ వ్యవస్థీకృతం కాలేదని ఆయన తెలిపారు.
కొలంబో విశ్వవిద్యాలయం నిర్వహించిన 19వ సుజాత జయవర్ధన స్మారక కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ..పార్లమెంట్, కార్యనిర్వాహకవర్గం, న్యాయవ్యవస్థ..ఇవేవీ సర్వోన్నతమైనవి కావని, రాజ్యాంగమే సర్వోన్నతమైనదని మాజీ ప్రధాన న్యాయమూర్తి అన్నారు.