న్యూఢిల్లీ, నవంబర్ 1: ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి సత్యేంద్రజైన్కు 2019లో రూ.10 కోట్లు ఇచ్చానని చెప్పారు. దీంతో బీజేపీ, ఆప్ మధ్య రాజకీయ దుమారం రేగింది. ఆప్ను మహా దోపిడీ పార్టీగా బీజేపీ అభివర్ణించగా, గుజరాత్లోని మోర్బీ వంతెన దుర్ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. రూ.200 కోట్ల హవాలా కేసులో సుకేశ్ ప్రస్తుతం మండోలి జైలులో ఉన్నారు. అక్టోబర్ 8న సుకేశ్ తన అడ్వకేట్ ద్వారా తమకు ఒక లేఖ రాశాడని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. తనకు దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన పార్టీ పదవి ఇస్తానన్నారని, రాజ్యసభకు నామినేట్ చేస్తానన్నారని, అందువల్ల తాను ఆప్కు రూ.50 కోట్లకు పైగా చెల్లించానని సుకేశ్ ఆ లేఖలో ఆరోపించారు.