చండీఘర్ : పంజాబ్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలోనే కాంగ్రెస్ ఫైట్ చేస్తుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి హరీశ్రావత్ ఆదివారం వెల్లడించారు. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా సిద్ధూకు పేరు ఉందన్నారు. పంజాబ్లో ఆయన పాపులర్ లీడర్ కూడా అని రావత్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను పార్టీ నాయకులు రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని తెలిపారు.
పంజాబ్ సీఎంగా చరణ్జిత్ సింగ్ చన్నీని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుందని చెప్పారు. త్వరలోనే ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ప్రమాణం చేస్తారని తెలిపారు. చరణ్జిత్ సింగ్ సోమవారం ఉదయం 11 గంటలకు పంజాబ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చరణ్జిత్ సింగ్ ప్రమాణస్వీకారానికి మాజీ సీఎం అమరీందర్ సింగ్కు ఆహ్వానం పంపామని పేర్కొన్నారు.