కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత గ్యాస్ ధరలు, పెట్రో ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచితే తాము తీవ్రంగా స్పందిస్తామని ఆయన హెచ్చరించారు. ‘ఎన్నికల తర్వాత కేంద్రం ధరలు పెంచితే, తాము రోడ్లపైకి వచ్చి పోరాడతామని హెచ్చరించారు. కేంద్రం మరోసారి సిలిండర్ల ధరలు పెంచింది. తాము పేద ప్రజలకు వ్యతిరేకమని, వారితో తమకు వచ్చేదేమీ లేదన్న సంకేతాలిచ్చింది. ఇవ్వాళ సిలిండర్ల ధర పెంపు.. రేపు పెట్రో ధరల పెంపు.’ అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. దీంతో పాటు అచ్ఛేదిన్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.
ఇక పాల ధరల పెంపుపై కాంగ్రెస్ నేత అల్కా లాంబా కూడా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మార్చి మాసంలో పాల ధరలను పెంచి, మహిళలను ఇబ్బందులకు గురి చేసిందని ఆమె మండిపడ్డారు. ఢిల్లీలో ఇప్పటికే సిలిండర్ల ధరలను పెంచిందని, ఎన్నికల తర్వాత కేంద్రం కచ్చితంగా ధరలను పెంచుతుందని అల్కా లాంబా అన్నారు.