న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాల రద్దు క్రెడిట్ను కాంగ్రెస్ తీసుకోవాలని బావిస్తున్నది. ఇందులో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా ‘కిసాన్ విజయ్ దివస్’ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కేంద్రం లోపభూయిష్ట నిర్ణయాలకు వ్యతిరేకంగా, రైతుల స్థిరమైన, ఆత్మీయ పోరాటానికి గుర్తింపుగా శనివారం దేశవ్యాప్తంగా కిసాన్ విజయ్ ర్యాలీలు, కిసాన్ విజయ సభలు నిర్వహించాలని రాష్ట్ర యూనిట్లను కాంగ్రెస్ పార్టీ కోరింది.
కాగా, వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఈ చట్టాలను ఎందుకు ఉపసంహరించుకుంది? అని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ డిప్యూటీ సీఎం ఎస్ఎస్ రంధవా ప్రశ్నించారు. ఈ నిర్ణయం వెనుక గల కారణాలను వారే వివరించాలని అన్నారు. నిరసనలో ప్రాణాలు అర్పించిన రైతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.