హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని సూరత్ లోక్సభ బరిలో కాంగ్రెస్ తరుఫున నిలబడ్డ అభ్యర్థి నీలేశ్ కుంభని కనిపించట్లేదని స్థానిక మీడియా తెలిపింది. రేపోమాపో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వెల్లడించింది. దీంతో కుంభని ఇంటిముందు చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు ‘ప్రజాద్రోహి’ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సూరత్
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కుట్రలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. కాగా, సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ నామినేషన్ తిరస్కరణకు గురవడం, నామినేషన్ల చివరి రోజు మిగతా అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తూ ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించడం తెలిసిందే.