ఇటీవల భారత దేశ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలో అవార్డు లభించిన అనంతర ఆయన ట్విట్టర్ ఖాతా బయో సెక్షన్లో మార్పులు చేశారని కొన్ని వార్తలు వచ్చాయి.
వీటిపై స్పందించిన కాంగ్రెస్ నేత.. ఈ వార్తలను ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రాపగాండ అంటూ అసహనం వ్యక్తం చేశారు. అవార్డు లభించిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు.
‘‘నా ట్విట్టర్ ప్రొఫైల్లో ఏమీ యాడ్ చేయలేదు, ఏమీ తీసేయలేదు. అంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంది’’ అని వివరించారు. గతంలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆజాద్.. ప్రజాక్షేత్రంలో చేసిన సేవలకుగాను ఆయనకు పద్మ భూషణ్ అవార్డు అందించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.