Congress Second List : రానున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. 43 మంది అభ్యర్ధులతో మంగళవారం రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో రాజస్దాన్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అభ్యర్ధులకు చోటు దక్కింది.
రెండో జాబితాలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్కు చింద్వారా నుంచి అభ్యర్ధిత్వం లభించగా రాజస్ధాన్ జలోర్ నుంచి మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ను బరిలో దింపింది.
ఇక కాంగ్రెస్ రెండో జాబితాలో రాజస్ధాన్ నుంచి 10 మంది అభ్యర్ధులు ఖరారయ్యారు. వీరిలో ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన రాహుల్ కస్వన్ పేరు ఉండటం గమనార్హం. టాంక్-సవోయి మాధాపూర్ నుంచి హరీష్ మీనాను కాంగ్రెస్ ఎంపిక చేసింది.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित CEC की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए 43 लोकसभा सीटों पर कांग्रेस उम्मीदवारों की दूसरी लिस्ट जारी की गई। pic.twitter.com/kgWoEkzKt6
— Congress (@INCIndia) March 12, 2024
Read More :
CAA | అందు కోసమే సిఎఎను తీసుకొచ్చారు : కూనంనేని సాంబశివరావు