న్యూఢిల్లీ : లఖింపూర్ ఖేరి ఘటనలో ఎనిమిది మంది రైతులు మరణించిన కేసుకు సంబంధించి సర్కార్ ఉదాసీనత వైఖరిని తప్పుపడుతూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం వెలుపల శనివారం నిరసన ప్రదర్శన చేపట్టారు.యూపీలోని లఖింపూర్ ఖేరిలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనంగా అనుమానిస్తున్న ఎస్యూవీ దూసుకుపోవడం, ఆపై జరిగిన అల్లర్లలో మొత్తం ఎనిమిది మంది మరణించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
కాగా ఈ ఘటనకు సంబంధించి యూపీ పోలీసులు సమన్లు జారీ చేయడంతో ఆశిష్ మిశ్రా శనివారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. లఖింపూర్ ఖేరి ఘటనకు సిట్ సభ్యులు ఆయనను ప్రశ్నించారు. ఇక రైతులపై దూసుకెళ్లిన వాహనం తమదేనని అయితే ఆ సమయంలో కారులో తమ కుమారుడు లేడని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా చెబుతున్న సంగతి తెలిసిందే.