కోవిడ్ కారణంగా నిలిచిపోయిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ దేశానికి భవిష్యత్ నిర్మాతలు విద్యార్థులేనని, కోవిడ్ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయని, తిరిగి తెరుచుకున్నాయని, అందుకే మధ్యాహ్న భోజనాన్ని తిరిగి ప్రారంభించాలని ఆమె కోరారు. లోక్సభలో జీరో అవర్లో సోనియా ఈ అంశాన్ని లేవనెత్తారు.
కోవిడ్ కారణంగా పాఠశాలలను మూసేయడంతో, మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఆపేశారని, సుప్రీం సూచనల మేరకు, ఆహార భద్రతా పథకం కింద ప్రజలకు ఆహార ధాన్యాలు ఇవ్వడం ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే.. పిల్లల విషయంలో మాత్రం.. ఎలాంటి తరుణోపాయాలను సూచించలేదని సోనియా పేర్కొన్నారు. దీని కారణంగా పిల్లలున్న కుటుంబాలు చాలా ఇబ్బందులు పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయని, అందుకే మధ్యాహ్న భోజనాన్ని కూడా తిరిగి ప్రారంభించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.