న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష రేసులో సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, శశిథరూర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్, మనీశ్ తివారీ, ముకుల్ వాస్నిక్, పృథ్వీరాజ్ చవాన్ పేర్లూ చక్కర్లు కొడుతున్నాయి.
తాను అధ్యక్ష పదవికి పోటీ చేయట్లేదని రాహుల్ గాంధీ మరోసారి సంకేతాలిచ్చారు. అధ్యక్ష పదవికి పోటీచేసేవారు.. ఆ పదవి కేవలం సంస్థకు సంబంధించినది కాదని, సైద్ధాంతిక పరమైనదని గుర్తుంచుకోవాలని సూచించారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ జారీ అయింది.