న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్కు దిశలేదని సోనియా గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. యువత స్వరాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా ఆ స్కీమ్కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. ఆర్మీ ఉద్యోగం ప్రయత్నిస్తున్న యువత శాంతియుతంగా, అహింసా పద్ధతిలో తమ డిమాండ్ల కోసం పోరాటం చేయాలని సోనియా కోరారు. నిరసన చేపడుతున్న యువతకు మద్దుతుగా కాంగ్రెస్ పార్టీ ఉందని, అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని సోనియా అన్నారు.
देश के युवाओं के नाम @INCIndia अध्यक्ष श्रीमती सोनिया गांधी की तरफ से संदेश। pic.twitter.com/K7BYcnNODw
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 18, 2022