న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ అనంతర సమస్యలతో బాధపడిన సోనియాగాంధీ.. వారం రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ నెల 12న ఆమె ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోనియా ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. విశ్రాంతి తీసుకోవాలని సోనియాకు వైద్యులు సూచించారని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎదుట ఈ నెల 23న సోనియా గాంధీ హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో రాహుల్ గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.