న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ విస్తరణ, క్యాబినెట్లో కొత్త ముఖాలకు చోటివ్వడంపై కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. అంతా సజావుగా సాగితే మోదీ ఘనతగా చెబుతూ పొరపాట్లు జరిగితే మంత్రులను బలిపశువులు చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు.
ఎన్నికల కోణంలోనే రాజకీయ లబ్ధి పొందేందుకు పలువురు దళితులు, బీసీలకు మంత్రివర్గంలో చోటుకల్పిస్తున్నారని, ప్రజలను మోసగించేందుకే ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే దుయ్యబట్టారు. రాజకీయ అనివార్యతతోనే తప్ప ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కాదని విమర్శించారు. ఇక రాష్ట్రపతి భవన్లో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు జరిగే కార్యక్రమంలో 43 మంది కేంద్ర మంత్రివర్గంలో కొలువుతీరనున్నారు.