Congress | లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పది మంది అభ్యర్థులతో మరో జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, బీహర్ నేత కన్నయ్య కుమార్ పేర్లు ఉన్నాయి. ఢిల్లీ నార్త్ ఈస్ట్ సీట్ నుంచి జేఎన్ యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్, పంజాబ్ లోని జలంధర్ (ఎస్సీ) స్థానం నుంచి చరణ్ జిత్ సింగ్ చన్నీ పోటీ చేస్తారు.
అమ్రుత్ సర్ నుంచి గుర్జీత్ సింగ్ ఔజ్లా, ఫతేగఢ్ సాహిబ్ (ఎస్సీ) నుంచి అమర్ సింగ్, భాటిండా స్థానానికి జీత్ మొహిందర్ సింగ్ సిద్దూ, సంగ్రూర్ నుంచి సుఖ్ పాల్ సింగ్ ఖైరా, పాటియాలా నుంచి డాక్టర్ ధరమ్ వీర్ గాంధీ, యూపీలోని అలహాబాద్ స్థానానికి ఉజ్వల్ రేవతి రమన్ సింగ్ ను బరిలో నిలిపింది. 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులతోపాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 75 మంది అభ్యర్థులతో మరో జాబితాను ప్రకటించింది.