సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో.. మూడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ లీడింగ్లో ఉన్నది. తాజా సమాచారం ప్రకారం అర్కి, ఫతేపుర్, జుబ్బల్-కోటకై స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ మండి సీటులోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. ఆ స్థానంలో ఆరు వేల ఓట్లతో తేడాతో కాంగ్రెస్ ముందంజలో ఉన్నది.