శ్రీనగర్: జమ్ముకశ్మీర్, లడఖ్లో పోటీ కోసం సీట్ల షేరింగ్ (Seat Sharing) ఫార్ములాను కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ప్రకటించాయి. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్లో భాగమైన ఈ రెండు పార్టీల మధ్య లోక్సభ ఎన్నికల్లో పోటీ కోసం సీట్ల ఒప్పందం ఖరారైంది. చెరో మూడు స్థానాల్లో ఈ రెండు పార్టీలు పోటీ చేయనున్నాయి. ఉదంపూర్, జమ్ము, లడఖ్ లోక్సభ స్థానాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ పడనున్నారు. అనంత్నాగ్, బారాముల్లా, శ్రీనగర్ లోక్సభ స్థానాల నుంచి ఎన్సీ అభ్యర్థులు బరిలో ఉంటారు. ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఈ మేరకు సోమవారం ప్రకటించారు.
కాగా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఇప్పటికే కశ్మీర్లోని మూడు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అనంత్నాగ్ స్థానం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్సీ అభ్యర్థితోపాటు గులాం నబీ ఆజాద్తో ముఫ్తీ తలపడనున్నారు.
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ దీనిపై స్పందించారు. పీడీపీ కూడా ఇండియా బ్లాక్లో భాగమే అని తెలిపారు. అయితే సీట్ల సర్దుబాటు వేరే అంశమని అన్నారు.