పంజాబ్ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో.. బుధవారం నాడు ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా పలువురుకి ఆహ్వానాలు అందాయి. వారిలో కాంగ్రెస్ నేత మనీష్ తెవారీ కూడా ఉన్నారు. తనకు వచ్చిన ఆహ్వానాన్ని ట్విట్టర్లో పంచుకున్న మనీష్.. సొంత పార్టీపై విమర్శలు చేశారు.
ముందుగా ఆహ్వానానికి బదులిస్తూ ప్రస్తుతం పార్లమెంట్ సెషన్లు జరుగుతున్నందున కార్యక్రమానికి హాజరుకాలేక పోతున్నట్లు వివరణ ఇచ్చారు. ‘‘ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు. కానీ పార్లమెంటు సెషన్ కారణంగా నేను రాలేకపోతున్నాను’’ అని చెప్పారు.
అక్కడితో ఆగకుండా, ‘‘ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే.. మా పార్టీ ఎమ్మెల్యేల్లో ఒకరైన చరణ్జీత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి నన్నెవరూ పిలవలేదు’’ అంటూ విమర్శించారు.
I congratulate @BhagwantMann on being sworn in as Chief Minister
I thank him for inviting me to his swearing in .
Due to Parliament being in session I will not be able to make it .
It is ironic I was not invited to @CHARANJITCHANNI ‘s swearing in though he was one of my MLA’s pic.twitter.com/AyW91uNyYE— Manish Tewari (@ManishTewari) March 16, 2022